
టీమిండియా వెటరన్ బ్యాట్స్ మెన్ చతేశ్వర్ పుజారా శుక్రవారం ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్తో ఆరుదైన ఘనత సాధించబోతున్నాడు. ఇది పుజారాకు 100 వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. టెస్టు మ్యాచ్కు ముందు పుజారా, అతని భార్య పూజ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మోడీతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పుజారాకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 100వ టెస్టుకు ముందు మంచి ప్రోత్సాహన్ని అందించినందుకు ప్రధాని మోడీకి పుజారా కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీలో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్తో 100 టెస్టులు ఆడిన 13వ భారత క్రికెటర్గా పుజారా రికార్డుల్లో నిలువనున్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు ఆడి ఈ లిస్టులో టాప్లో ఉన్నాడు. ప్రస్తుత భారత టెస్టు జట్టులో 100 టెస్టులు ఆడిన రెండో క్రికెటర్గా పుజారా నిలవనున్నాడు. ప్రస్తుత జట్టులో విరాట్ కోహ్లీ గతేడాది మార్చ్లో శ్రీలంకపై వందో టెస్టు మ్యాచ్ ఆడాడు.
ఇక100 టెస్టు మ్యాచ్లు ఆడిన భారత క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134 ). అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగసర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), ఇషాంత్ శర్మ (105), హర్భజన్ సింగ్ (103), వీరేందర్ సెహ్వాగ్ (103) లు ఉన్నారు. 2010లో తన అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించిన పుజారా... బెంగళూరు వేదికగా ఆసీస్తో జరిగిన టెస్టు మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్లో కేవలం నాలుగు పరుగులే చేసినా.. రెండో ఇన్నింగ్స్లో 72 పరుగులు చేశాడు. ఇక ఇప్పటివరకు పుజారా 99 టెస్టుల్లో 44.16 సగటుతో 19 సెంచరీలు, 34 అర్ధసెంచరీలతో 7,021 పరుగులు చేశాడు.