
హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, ఆ ప్రాజెక్టు ముంపు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ప్రగతి మీటింగ్లో పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ఫస్ట్ ఎజెండా ఐటెంగా చేర్చారు. మన అధికారులు వీడియో కాన్ఫరెన్స్ద్వారా మీటింగ్కు హాజరుకానున్నారు.
వాస్తవానికి గత నెల 28న నిర్వహించిన ప్రగతి మీటింగ్లోనే పోలవరం అంశాన్ని చర్చించాల్సి ఉన్నా ఆ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారు. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుతో మనకు తీవ్ర నష్టం జరుగుతున్నదని మొదటి నుంచి తెలంగాణ వాదిస్తున్నది. అందుకు అనుగుణంగా ప్రధాని ముందు అభ్యంతరాలను తెలియజేసేందుకు మన అధికారులు ఎజెండా అంశాలను సిద్ధం చేశారు.