డబుల్​ సెంచరీతో దుమ్మురేపిన పృథ్వీ షా

డబుల్​ సెంచరీతో దుమ్మురేపిన  పృథ్వీ షా

గువాహతి: టీమిండియాలో​ రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ముంబై స్టార్ బ్యాటర్​​ పృథ్వీ షా (283 బాల్స్​లో 33 ఫోర్లు, 1 సిక్స్​తో 240 బ్యాటింగ్​) రంజీ మ్యాచ్​లో డబుల్​ సెంచరీతో దుమ్మురేపాడు. అసోంతో మంగళవారం మొదలైన మ్యాచ్​లో తన ఫస్ట్​ క్లాస్​ కెరీర్​లో హయ్యెస్ట్​ స్కోరు నమోదు చేశాడు. దీంతో టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్​ ఇన్నింగ్స్​లో 90 ఓవర్లలో 397/2 స్కోరు చేసింది.

పృథ్వీతో పాటు కెప్టెన్​ అజింక్యా రహానె (73 బ్యాటింగ్​) క్రీజులో ఉన్నాడు. స్టార్టింగ్​ నుంచే సూపర్​ షాట్లతో రెచ్చిపోయిన పృథ్వీ.. ముషీర్​ ఖాన్​ (42)తో తొలి వికెట్​కు 123, అర్మాన్​ జాఫర్​ (27)తో సెకండ్​ వికెట్​కు 74, రహానెతో థర్డ్​ వికెట్​కు 200 రన్స్​ జోడించాడు. అసోం స్పిన్నర్​ రోషన్​ ఆలమ్​ బౌలింగ్​ను ఓ ఆటాడుకున్న పృథ్వీ 76 రన్స్​ రాబట్టాడు.