గువాహతి: టీమిండియాలో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ముంబై స్టార్ బ్యాటర్ పృథ్వీ షా (283 బాల్స్లో 33 ఫోర్లు, 1 సిక్స్తో 240 బ్యాటింగ్) రంజీ మ్యాచ్లో డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. అసోంతో మంగళవారం మొదలైన మ్యాచ్లో తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో హయ్యెస్ట్ స్కోరు నమోదు చేశాడు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 397/2 స్కోరు చేసింది.
పృథ్వీతో పాటు కెప్టెన్ అజింక్యా రహానె (73 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. స్టార్టింగ్ నుంచే సూపర్ షాట్లతో రెచ్చిపోయిన పృథ్వీ.. ముషీర్ ఖాన్ (42)తో తొలి వికెట్కు 123, అర్మాన్ జాఫర్ (27)తో సెకండ్ వికెట్కు 74, రహానెతో థర్డ్ వికెట్కు 200 రన్స్ జోడించాడు. అసోం స్పిన్నర్ రోషన్ ఆలమ్ బౌలింగ్ను ఓ ఆటాడుకున్న పృథ్వీ 76 రన్స్ రాబట్టాడు.