అదుపు తప్పి స్కూల్​ బస్సు బోల్తా

అదుపు తప్పి  స్కూల్​ బస్సు బోల్తా

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని శ్రీవివేకానంద స్కూల్​( శ్రీ చైతన్య టెక్నో స్కూల్) వ్యాన్ సోమవారం బోల్తా పడింది. డ్రైవర్​​ఫోన్ ​మాట్లాడుతూ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం స్కూల్​అయిపోయిన తర్వాత ప్రైమరీ చదువుతున్న 20 మంది విద్యార్థులతో బస్సు బయలుదేరింది. 

డ్రైవర్​ ఫోన్​ మాట్లాడుతూ నడపగా కేసముద్రం టౌన్ లోని బైపాస్ రోడ్డు దగ్గర అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలో బోల్తా పడింది. అక్కడే ఉన్న స్థానికులు అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లలు స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కొంతమంది తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని పిల్లలను ఆటోల్లో ఇండ్లకు తీసుకువెళ్లారు. కేసముద్రం పోలీసులు వచ్చి బస్సును బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.