
ఒక స్థాయికి చేరుకోవాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సిందే. అందుకు తాను కూడా అతీతం కాదంటోంది ప్రియాంకా చోప్రా. బాలీవుడ్ హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టి హాలీవుడ్ దాకా ఎదిగిందామె. అయితే ఆ పొజిషన్కి వెళ్లడానికి ఎన్నో కష్టాలు పడ్డానని చెబుతోంది. ‘నేను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో అవమానాలు ఉన్నాయి. ఎంతో వేదన ఉంది. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఒక సినిమాలో క్యారెక్టర్ ఓకే అయ్యేది. తర్వాత సడెన్గా ఆ సినిమా నుంచి తొలగించేసేవారు. కారణం కూడా చెప్పేవారు కాదు. డైరెక్టర్స్అయితే షూటింగ్ టైమ్లో అందరి ముందు అరిచేవారు కూడా. చాలా ఏడుపొచ్చేది. సినిమా నుంచి తొలగించేయడం చాలా సిగ్గుగా కూడా ఉండేది. అటువంటప్పుడు మా నాన్నే నన్ను ఓదార్చేవారు. ఎలాంటి కష్టమొచ్చినా ఎదుర్కోవాలని నా వెన్నుతట్టి ధైర్యాన్నిచ్చేవారు. మెల్లగా ఎదుర్కొనేందుకు సిద్ధపపడ్డాను. అవమానాలను దిగమింగాను. ఏ విషయాన్నైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి డెసిషన్ తీసుకునేదాన్ని. దానికితోడు షూటింగ్ సమయాల్లో పగలనక, రాత్రనక కష్టపడేదాన్ని. అవన్నీ కలిసి ఈ రోజు నన్నీ స్థితిలో నిలబెట్టాయి’ అంటూ చెప్పుకొచ్చింది పీసీ. ఆమె నటించిన ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఇవన్నీ చెప్పింది ప్రియాంక