హక్కులను కాలరాసే ప్రయత్నమే : ప్రియాంక గాంధీ

హక్కులను కాలరాసే ప్రయత్నమే : ప్రియాంక గాంధీ
  • బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్​

జైపూర్: ప్రజల హక్కులను కాలరాసేందుకే బీజేపీ రాజ్యాంగ సవరణపై చర్చలు జరుపుతోం దని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ప్రధాని మోదీ పదేండ్ల పాలన తప్పుడు వాగ్దానాలతో పూర్తయిందన్నా రు. కాంగ్రెస్ అభ్యర్థి మురారీ లాల్ మీనాకు మద్దతుగా రాజస్థాన్‌‌‌‌లోని బండికుయ్‌‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగ సవరణ చేసి.. ప్రజల హక్కులను లాక్కోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎవరూ గుర్తించనిరీతిలో దానిని పూర్తిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బహిరంగ సభల్లో మోదీ పదే పదే రాజ్యాంగం గురించి మాట్లాడుతారని.. కానీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేసే రాజ్యాంగ సవరణ గురించి ఆయన మాట్లాడాలని ప్రజలు కోరుతున్నారని ప్రియాంక అన్నారు.