యూపీలో గెలుపు కోసం కాంగ్రెస్ శాయశక్తులను ఒడ్డుతోంది. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఆమె జోరుగా ప్రచారం చేశారు. మీరట్, ఆగ్రా, మధుర జిల్లాలో ప్రియాంక క్యాంపెయిన్ నిర్వహించారు. మధురలోని విశ్రమ్ ఘాట్ లో వేద మంత్రోచ్ఛారణల మధ్య యుమనా పూజ నిర్వహించారు. తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నప్పుడు తాము పడిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మీరట్ లో ప్రచారం సందర్భంగా ట్రాక్టర్ పైకి ఎక్కి మహిళలతో సెల్ఫీ దిగారు ప్రియాంక. యూపీలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని.. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రాష్ట్రంలో 403 స్థానాలకు గానూ 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరగనుంది.
LIVE:
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 8, 2022
जय यमुना मैया।
यमुना पूजन, विश्राम घाट, मथुरा।
https://t.co/lgkwCvSoBJ
మరిన్ని వార్తల కోసం