16 న త్రిపురలో ప్రియాంక రోడ్​షో

16 న త్రిపురలో ప్రియాంక రోడ్​షో

అగర్తల: ఈ నెల 16న త్రిపురలో జరిగే రోడ్ షోలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. రెండు లోక్​సభ సెగ్మెంట్లు త్రిపుర వెస్ట్, త్రిపుర ఈస్ట్​ నుంచి ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ఆమె ప్రచారం చేయనున్నారు. 

ప్రియాంక అగర్తలకు రానున్నారని, రోడ్​షో సందర్భం గా చౌముహాని వద్ద ఆమె ప్రసంగిస్తారని త్రిపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మాన్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఇండియా కూటమి ధర్మ యుద్ధం చేస్తోంద ని, ప్రతిఒక్కరూ పాల్గొని రోడ్​షో సక్సెస్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులను ఆయన కోరారు. త్రిపుర వెస్ట్ సెగ్మెంట్​కు ఏప్రిల్ 19న, త్రిపుర ఈస్ట్ లోక్​సభ సెగ్మెంట్​కు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.