ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. అస్సాంలో ఎలాగైనా తన సత్తాచాటాలని చూస్తుంది. తిరిగి పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అస్సాంలోని తేజ్పూర్లో ప్రచారంలో భాగంగా చిన్నా, పెద్దా, పేద, ధనికా అని తేడా లేకుండా వారితో మమేకం అవుతున్నారు. ఈ సందర్భంగా అక్కడి మహిళలకు ప్రియాంక గాంధీ ఓ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గృహిణి సమ్మన్ పేరుతో ప్రతీ గృహిణికి నెలకు రూ.2 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు .అంతేగాకుండా టీ గార్డెన్స్ లో పనిచేసే వారికి రోజుకు రూ.365 ఇస్తామని చెప్పింది. 5 లక్షల కొత్త ద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. అస్సాంతో CAA అమలు చేయబడకుండా ఒక చట్టం తెస్తామన్నారు. ప్రతి నెల 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామన్నారు.
We will provide Rs 2,000 per month to all the housewives as 'grihini samman'. The woman working in tea gardens will be provided Rs 365 per day. We'll create 5 lakhs new govt jobs. These are not promises but guarantee: Congress General Secretary Priyanka Gandhi in Tezpur, Assam pic.twitter.com/mZ9vdvG7aw
— ANI (@ANI) March 2, 2021