ప్రియాంక గాంధీకి మరోసారి కరోనా

ప్రియాంక గాంధీకి మరోసారి కరోనా

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మరోసారి కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ప్రియాంక ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. అన్ని నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను ’’ అని ఆమె ట్వీట్ చేశారు. 

గత జూన్ లోనే కరోనా బారిన పడ్డారు ప్రియాంక. రెండు నెలల వ్యవధిలోనే మరోసారి కరోనా సోకడం గమనార్హం. మరోవైపు రాహుల్ గాంధీ కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇవాళ్టి రాజస్థాన్ పర్యటనను ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. ఇటీవలే సోనియా గాంధీకి కూడా కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆమె కోలుకున్నారు.