వాళ్లిద్దరూ ఓ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్లు. కెమికల్స్తో రియాక్షన్లు చేయించి చేయించి.. వాటిని వండడం బాగా వంటబట్టినట్టుంది. అందుకే ల్యాబ్లోనే మెథాంఫిటామైన్(మెథ్) అనే డ్రగ్ను వండడం మొదలుపెట్టారు. పారాఫెర్నాలియా అనే డ్రగ్తో మెథ్ను తయారు చేయడం ప్రారంభించారు. వాసన పసిగట్టిన పోలీసులు కాలేజీలో దర్యాప్తు చేసి ఆ ఇద్దరు కెమిస్ట్రీ ప్రొఫెసర్లు టెర్రీ డేవిడ్ బేట్మన్, బ్రాడీ అలెన్ రోలాండ్ అమెరికాలోని అర్కాన్సస్లో ఉన్న క్లార్క్ కౌంటీలోని హెండర్సన్ స్టేట్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. వాళ్లిద్దరూ అక్టోబర్ 11 నుంచి సెలవులో ఉన్నారని యూనివర్సిటీ యాజమాన్యం ప్రకటించింది.
