తొమ్మిదేండ్లలో అగ్రికల్చర్‌‌‌‌లో  ప్రగతి సాధించినం.. ఆగ్రోస్‌‌‌‌ ఎండీ  రాములు

తొమ్మిదేండ్లలో అగ్రికల్చర్‌‌‌‌లో  ప్రగతి సాధించినం.. ఆగ్రోస్‌‌‌‌ ఎండీ  రాములు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగంలో ఎంతో ప్రగతి సాధించామని ఆగ్రోస్‌‌‌‌ ఎండీ, తెలంగాణ అగ్రి డాక్టర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌  వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాములు అన్నారు.

సోమవారం అగ్రి డాక్టర్స్  అసోసియేషన్  ఆధ్వర్యంలో అగ్రికల్చర్‌‌‌‌  కమిషనరేట్‌‌‌‌లో రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాలు   నిర్వహించారు. రైతుల కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో  రైతు బంధు, రైతు బీమా పథ కాలు అమలు చేస్తున్నారని రాములు పేర్కొన్నారు.

రైతు సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు  రాష్ట్ర వ్యవసాయ రంగం రూపురేఖలను మార్చివేశాయని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజరత్నం అన్నారు. వ్యవసాయ శాఖ రైతులకు మరింత చేరువై సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి తిరుపతి అన్నారు.