జన్ ఔషది కేంద్రంలో ప్రభుత్వం బ్యాన్ చేసిన మెడిసిన్

జన్ ఔషది కేంద్రంలో ప్రభుత్వం బ్యాన్ చేసిన మెడిసిన్

సికింద్రాబాద్ : గవర్నమెంట్ బ్యాన్ చేసిన మెడిసిన్ అమ్ముతుండగా ఓ మెడికల్ షాప్ లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సికింద్రాబాద్, రైల్వే స్టేషన్లోని మెడికల్ షాప్ లో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల రైడ్స్ చేశారు. జన్ ఔషది కేంద్రంలో  నిషేధిత డ్రగ్స్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించారు.  

2018లో ప్రభుత్వం నిషేధించిన ఆఫ్లక్ససిన్, ఆర్నిడజోల్ సస్పెన్షన్ జన్ ఔషది కేంద్రంలో అమ్ముతున్నారు. ఆయా మందులను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిని వాడడం చాలా ప్రమాదకరమని, ప్రాణాంతకమైనవని అధికారులు సూచించారు.