ఎమ్మెల్యేకు నిరసన సెగ.. 

ఎమ్మెల్యేకు నిరసన సెగ.. 
  • హామీలు అమలు చేయాలంటూ ఎమ్మెల్యే చెన్నమనేనిని అడ్డుకున్న బీజేపీ నాయకులు
  • టీఆర్ఎస్-బీజేపీ నాయకుల మధ్య తోపులాట

రాజన్న సిరిసిల్ల జిల్లా: టీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కు నిరసన సెగ తగిలింది. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో కొత్త హెల్త్ సెంటర్ కు భూమి పూజ చేసేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను బీజేపీ నాయకులు అడ్డుకుని నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపు చేశారు.  బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు.అంతకుముందు కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.