ముఖ్యమంత్రి కేసీఆర్ కు పీఆర్టీయూ కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి కేసీఆర్ కు పీఆర్టీయూ కృతజ్ఞతలు

హైదరాబాద్,వెలుగు: రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ సంతృప్తి పరిచేలా పీఆర్సీని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, కమలాకర్​ రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

రెండో పీఆర్సీని త్వరలోనే ప్రకటిస్తామని, ఐఆర్ ఇస్తామని అసెంబ్లీలో ఆదివారం సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనను పీఆర్టీయూ నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సిగ్ ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని గుర్తుచేశారు. త్వరలోనే పీఆర్సీ కమిటీ వేసేందుకు సహకరించిన మంత్రి హరీశ్​రావుకు వారు కృతజ్ఞతలు చెప్పారు.