చిత్తూరు జిల్లా: యాదమరి మండలం మాదిరెడ్డి పల్లె గ్రామంలో శుక్రవారం సురేష్ అనే సైకో వీరంగం సృష్టించాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలుపడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా పోలీసులపై తిరగబడ్డాడు సురేష్. వెంటనే ఎస్ఐ నాగేశ్వరరావు అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. సైకో ఎస్ఐపై దాడి చేయడంతో ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి.
మొత్తానికి అతి కష్టం మీద సైకోను తీసుకొని చిత్తూర్ ఆసుపత్రికి తరలించి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. హాస్పిటల్లోనూ సైకో ..వైద్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో .. తాడుతో కట్టేశామని తెలిపారు డాక్టర్లు. ఇదే విషయంపై.. ఎస్ఐ మాట్లాడుతూ సైకో దాడిలో తనకు తీవ్రగాయాలయ్యాయని, సురేష్ పై ఇది వరకే అత్యాచారం, హత్య కేసులు ఉన్నాయని తెలిపారు.