న్యూఢిల్లీ : పుణేకు చెందిన తొమ్మిదేళ్ల అద్వైత్ ఆఫ్రికాలోనే అత్యంత ఎతైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతం సుమద్ర మట్టానికి 19,341 ఫీట్ల ఎత్తులో ఉన్న సంగతి తెలిసిందే. తన ట్రైనర్ సమీర్ సారథ్యంలో అద్విత్ జూలై 31వ తేదీన ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అద్వైత్ మాట్లాడుతూ.. ‘పర్వతారోహణ అనేది చాలా కష్టమైనది. చాలా సరదాగా కూడా ఉంటుంది. ట్రెక్కింగ్ చేసేటప్పడు గొప్ప అనుభూతి కలుగుతుంది. నేను చాలా త్వరగా ట్రెక్కింగ్ పూర్తి చేయాలనుకున్నాను.
పర్వతాల్లో ఉన్న అందాలను చూడటానికి నేను చాలా సార్లు విరామం తీసుకున్నాను. పైకి వెళ్లే కొద్ది ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. అలాగే ఉష్ణోగ్రతలు మైనస్లలో ఉంటాయి. అలాగే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంద’ని తెలిపాడు. అయితే అద్వైత్ తనకు ఆరేళ్లున్నప్పుడే(2016లో) ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. ఏడు రోజుల్లోనే ఆ ఘనత సాధించాడు. అద్వైత్ సాధించిన ఘనతపై అతని తల్లి పాయల్ ఆనందం వ్యక్తం చేశారు. అద్వైత్ ను చూస్తే గర్వంగా ఉందన్నారు.