ప్రియాంక గాంధీతో నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ

ప్రియాంక గాంధీతో నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ

ఢిల్లీలో బిజీగా ఉన్నారు పంజాబ్ కాంగ్రెస్ నేత నవ్ జోత్ సింగ్ సిద్ధూ. నిన్న రాహుల్ గాంధీతో మీటింగ్ క్యాన్సిల్ కాగా... ఇవాళ ప్రియాంక గాంధీని కలిశారు. ప్రియాంకతో చాలా సేపు చర్చించినట్టు ట్వీట్ చేశారు సిద్ధూ. పంజాబ్ లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సిద్ధుల మధ్య గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. వీరిద్ధరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు అనేకరోజులుగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి నేతల అభిప్రాయాలు తీసుకుంది. అమరీందర్ సింగ్, సిద్ధూ కూడా కమిటీ ముందు తమ వాదన వినిపించారు. ఫైనల్ గా రాహుల్ గాంధీని కలిసేందుకు నిన్న ఢిల్లీ వచ్చారు నవ్ జోత్ సింగ్ సిద్ధూ. అయితే మీటింగ్ జరగలేదు. దీంతో ఇవాళ ప్రియాంకతో కలిశారు. ఈ మీటింగ్ తర్వాత రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లారు ప్రియాంక.