చండీగఢ్: పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో కొత్త విశేషం చోటుచేసుకుంది. గురువారం వెలువడిన రిజల్ట్స్లో 13 మంది డాక్టర్లు విజయం సాధించారు. ఈ విషయంపై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో రాజకీయంగా కొత్త చరిత్ర సృష్టించామన్నారు. ప్రాణాలు కాపాడే వైద్యులు.. ఇప్పుడు ప్రజాప్రతిధులుగా ఎన్నికయ్యారని, కంగ్రాట్స్ అంటూ జైన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయం సాధించిన 93 మంది అభ్యర్థుల్లో.. 13 మంది మహిళా క్యాండిడేట్లు ఉండటం విశేషం. ఆప్ మహిళా అభ్యర్థుల్లో ఒకరైన జీవన్జ్యోత్ కౌర్ (అమృత్సర్ నియోజకవర్గం) పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్జోత్ సింగ్ సిద్ధూపై 6,750 ఓట్ల మెజారిటీతో నెగ్గారు.
Political history created in India. For the first time 13 doctors have been elected as AAP MLAs in Punjab.
— Satyendar Jain (@SatyendarJain) March 11, 2022
Life saviours are now public representatives
Congratulations @bhagwantmann@AAPunjab pic.twitter.com/CA0G2hBoru
మరిన్ని వార్తల కోసం: