హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ) తయారీ సంస్థ క్వాంటమ్ఎనర్జీ ఏప్రిల్ 30వ తేదీ వరకు చేసే ప్రతి బైక్ కొనుగోలుపై పెద్ద మొత్తంలో అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రయోజనాలలో మింత్రా, పిజ్జా హట్, పేటీఎం, ది మ్యాన్ కంపెనీ మరిన్ని ప్రముఖ బ్రాండ్ల నుంచి ప్రత్యేకమైన బ్రాండ్ ఆఫర్లు, కూపన్లు ఉన్నాయి. తన కొత్త మోడళ్లయిన ప్లాస్మా ఎక్స్, ఎక్స్ఆర్లపై పరిమిత-కాల ఆఫర్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్ 30 వరకు ఆఫర్ ఉంటుంది. వీటి ధరలు గతంలో వరుసగా రూ. 1,19,525, రూ. 99,757 కాగా ఇప్పుడు 10 శాతం తగ్గింపుతో కొనుక్కోవచ్చని క్వాంటమ్ తెలిపింది. వీటిలో 1,500 వాట్ల మోటార్ ఉంటుంది.