క్వాంటమ్​ ఎనర్జీ స్కూటర్లపై ఆఫర్లు

క్వాంటమ్​ ఎనర్జీ స్కూటర్లపై ఆఫర్లు

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రిక్​ వెహికల్స్​(ఈవీ) తయారీ సంస్థ  క్వాంటమ్​ఎనర్జీ ఏప్రిల్ 30వ తేదీ వరకు చేసే ప్రతి బైక్ కొనుగోలుపై పెద్ద మొత్తంలో అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రయోజనాలలో మింత్రా, పిజ్జా హట్, పేటీఎం, ది మ్యాన్ కంపెనీ  మరిన్ని ప్రముఖ బ్రాండ్‌‌‌‌ల నుంచి ప్రత్యేకమైన బ్రాండ్ ఆఫర్లు,  కూపన్లు ఉన్నాయి. తన కొత్త మోడళ్లయిన ప్లాస్మా ఎక్స్,  ఎక్స్‌‌‌‌ఆర్‌‌‌‌లపై పరిమిత-కాల ఆఫర్‌‌‌‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 

ఏప్రిల్ 30 వరకు ఆఫర్​ ఉంటుంది.  వీటి ధరలు గతంలో వరుసగా రూ. 1,19,525,  రూ. 99,757 కాగా ఇప్పుడు  10 శాతం తగ్గింపుతో కొనుక్కోవచ్చని క్వాంటమ్​ తెలిపింది. వీటిలో 1,500 వాట్ల మోటార్​ ఉంటుంది.