రియల్టర్ల హత్య కేసును చేధించిన పోలీసులు

రియల్టర్ల హత్య కేసును చేధించిన పోలీసులు
  • రియల్ ఎస్టేట్ వ్యవహారంలోనే కాల్పులు
  • ఇబ్రహీంపట్నం రియల్టర్ల హత్య కేసును చేధించిన పోలీసులు

 

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఇద్దరు రియల్టర్ల హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుపై గురువారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీపీ మహేష్ భగవత్.. ఇబ్రహీంపట్నం రియల్టర్ హత్య కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు మట్టారెడ్డితో సహా నిందితులందరినీ అరెస్ట్ చేశామన్నారు. రెండ్ తుపాకులు, 19 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ తుపాకులు బీహార్ లో కొన్నవని తెలిపిన సీపీ.. ఆరుగురిలో ఇద్దరు బీహార్ నిందితులు ఉన్నారన్నారు. ప్రధాన నిందితుడైన మట్టారెడ్డికి పెద్ద నేర చరిత్ర ఉందని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలోనే కాల్పులు జరిగాయని తెలిపారు.