
న్యూఢిల్లీ: దేశాన్ని ఏకం చేసే వరకు యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రను ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా ఆయన గురువారం ట్విట్టర్లో స్పందించారు. గత ఏడాది ఇదే రోజున కన్యాకుమారిలో జోడో యాత్రను ప్రారంభించడానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. కోట్లాది మందిని మంచివైపు నడిపించే అడుగులు భారత్ జోడో యాత్ర ద్వారా పడ్డాయని రాహుల్ కామెంట్ చేశారు. ‘ప్రయాణం కొనసాగుతుంది. ద్వేషాన్ని నిర్మూలించే వరకు, భారతదేశం ఏకం అయ్యే వరకు. ఇది నా వాగ్దానం’ అని ఆయన పేర్కొన్నారు.