న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో యూరప్లో పర్యటించను న్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో కీలకమైన జీ20 సదస్సు జరగనుంది. ప్రస్తుతం ఇండియా జీ20 అధ్యక్ష బాధ్యత లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రాహుల్ విదేశాలకు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తం 5 రోజుల పర్యటన కోసం రాహుల్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పారిస్ వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 7న బ్రస్సెల్స్లో ఈయూ సభ్యులతో జరిగే భేటీలో ఆయన పాల్గొంటారు. 8న పారిస్ లోని ఓ యూనివర్సిటీలో స్టూడెంట్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
9న పారిస్లో జరిగే లేబర్ యూనియన్ ఆఫ్ ఫ్రాన్స్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత రాహుల్ నార్వేకు వెళ్తారు. సెప్టెంబర్ 10న అక్కడ భారతీయ ప్రవాసుల కార్యక్రమంలో ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.