2024లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ వచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ రాయ్ ప్రకటించారు.
రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తే.. ప్రియాంగ గాంధీ వారణాసి నుంచి లేదా మరే ఇతర స్థానం నుంచి పోటీచేస్తారని అజయ్ రాయ్ తెలిపారు. ప్రియాంక గాంధీ వారణాసి లేదా ఇతర ఏస్థానం నుంచైనా పోటీ చేస్తే..ఆమె గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేస్తారని చెప్పారు.
#WATCH | UP Congress chief Ajay Rai on 2024 Lok Sabha elections, says, "Rahul Gandhi will contest from Amethi. Priyanka ji can contest from Varanasi if she wishes to do so..." pic.twitter.com/lfdp6tCP67
— ANI (@ANI) August 18, 2023
ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 2009, 2014 ఎన్నికలలో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55,000 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు.