రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 తేదీ ఖరారు.. ఎప్పుడు..? ఎక్కడ నుంచి..?

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 తేదీ ఖరారు.. ఎప్పుడు..? ఎక్కడ నుంచి..?

ఢిల్లీ : మొదటి విడత భారత్ జోడో యాత్రకు అశేష ఆదరణ లభించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో విడత పాదయాత్రకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజు రెండో విడత యాత్ర చేపట్టనున్నారు.  

గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి మేఘాలయా వరకు రెండో విడత భారత్‌ జోడో యాత్ర కొనసాగనుంది. మహాత్మ గాంధీ పుట్టిన గడ్డ నుంచే గాంధీ జయంతి రోజునే ఈ యాత్ర ప్రారంభం కానుంది. లడఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మరోసారి దేశం మొత్తం యాత్ర చేయడానికి పూనుకున్నారు. కాంగ్రెస్‌ను ప్రజల వద్దకు తీసుకుపోవడానికి, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మరోసారి నడుం బిగించారు. 

2024 జనవరిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో విడత యాత్ర ముగియనుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొననున్నారు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

మొదటిసారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర కొనసాగించారు రాహుల్.  రెండోసారి భారత్ జోడో యాత్రలో గుజరాత్ నుంచి మేఘాలయా వరకు పర్యటించనున్నారని తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది.