వర్షంతో భారీగా స్థంభించిన ట్రాఫిక్ 

వర్షంతో భారీగా స్థంభించిన ట్రాఫిక్ 

హైదరాబాద్: సిటీ శివారులో వర్షం దంచి కొట్టింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, దిల్షుఖ్ నగర్, నాగోల్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. వనస్థలిపురంలో విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు భారీగా చేరింది. ఇలా చింతలకుంట, ఆటో నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో మూడు ప్లేస్ లలో రోడ్డుపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చింతలకుంటలో వరద నీటిలో రెండు కారులు నిలిచిపోగా..  నాలుగు కార్లలోకి నీరు చేరి వెహికల్ ఓనర్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఆటో నగర్ లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. నాగోల్, ఎల్బీ నగర్ లో రోడ్డుపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ చూసినా భారీగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్థంభించింది. అంబులెన్స్ లు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. టూ వీలర్స్ స్కిడ్ అయి కింద పడిపోయారు. చింతలకుంటలో ఉన్న ఓ బైక్ షోరూం సెల్లార్ లోకి వరద నీరు చేరింది.