వర్షంతో నిలిచిపోయిన భారత్  – కివీస్ రెండో టీ20

వర్షంతో నిలిచిపోయిన భారత్  – కివీస్ రెండో టీ20

భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న రెండో టీ20కి  వర్షం అడ్డంకిగా మారింది. ఇన్నింగ్స్ 6.4 ఓవర్ల వద్ద వర్షం పడడంతో అంపైర్లు ఆటను నిలిపేశారు.   ప్రస్తుతం భారత్ స్కోర్ 50/1. క్రీజులో ఇషాన్ కిషన్ (28), సూర్యకుమార్ (6) ఉన్నారు. 6రన్స్ వద్ద రిషబ్ పంత్ ఔట్ అయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్ ఒక వికెట్ తీశాడు. 

అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దవడంతో ఇవాళ్టి మ్యాచ్ పై ఇరుజట్లు దృష్టి పెట్టాయి.. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉండటంతో ఇరుజట్లు వ్యూహాలకు పదునుపెట్టాయి. అయితే ఈ మ్యాచ్ కు కూడా అడ్డంకిగా మారడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.