
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ (జూన్ 16న) రెండెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 16న 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా నిధుల జమ చేశామన్నారు. 41.25 లక్షల మంది రైతులకు 39.16 లక్షల ఎకరాలకు గాను 2349.83 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే 9 రోజులలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పారు.
రైతు భరోసా డబ్బులు రిలీజ్
రాజేంద్ర నగర్ అగ్రివర్శిటీలో రైతు నేస్తం ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు జమ చేస్తామన్నరేవంత్... 70 లక్షల 11 వేల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పారు. మొత్తం కోటి 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పథకాలు ఆపడం లేదన్నారు రేవంత్.