రాజకీయాలు చేయడానికి రాజ్ భవన్ అడ్డా కాదు: గవర్నర్ తమిళిసై

రాజకీయాలు చేయడానికి రాజ్ భవన్ అడ్డా కాదు: గవర్నర్ తమిళిసై

రాజకీయాలు చేయడానికి రాజ్ భవన్ అడ్డా కాదన్నారు గవర్నర్ తమిళిసై. వ్యవసాయ చట్టంపై కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ అపాయింట్ మెంట్ ను కోరగా.. ఆమె అపాయింట్ మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై తమిళిసై అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని గవర్నర్ అన్నారు. గత నాలుగు నెలలుగా ఇదే విధానాన్ని రాజ్ భవన్ పాటిస్తోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రాజ్ భవన్ వ్యవహరిస్తోందని తెలిపారు. రాజ్ భవన్ తలుపులు అందరి కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు తమిళిసై. ఎవరికైనా ఎలాంటి సమస్యలైనా ఉంటే… మెయిల్ చేయాలని సూచించారు.