
రాజ్ తరుణ్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘తిరగబడర సామీ’. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్స్. ఈ మూవీ షూటింగ్తో పాటు ఆదివారంతో పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘మేజర్ పార్ట్ షూట్ తెలంగాణలోనే జరిగింది. జహీరాబాద్లోని సరికొత్త లొకేషన్స్లో షూట్ కంప్లీట్ చేశాం.
యూత్ను ఆకట్టుకునే రొమాన్స్తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్ సినిమాపై పాజిటివ్ బజ్ను క్రియేట్ చేశాయి. మకరంద్ దేశ్పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వీ, ప్రగతి, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. భాష్యశ్రీ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తుండగా, జేబీ సంగీతం అందిస్తున్నాడు.