
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘SSMB 29’వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు మహేష్, ప్రియాంక చోప్రాలపై ఓ సాంగ్ను కూడా చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ పూర్తవడంతో కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వాలనుకున్నారట రాజమౌళి. ఎండల తీవ్రత కూడా ఎక్కువ ఉండటంతో దాదాపు నలభై రోజుల తర్వాతే నెక్స్ట్ షెడ్యూల్ మొదలుపెట్టేలా ప్లాన్ చేశారట. దీంతో ఈ సమ్మర్ హాలీడేస్ను మహేష్ బాబు.. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయనున్నాడట. త్వరలోనే కుటుంబంతో కలిసి ఫారిన్ వెకేషన్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక జూన్ 10 నుంచి ఈ మూవీ షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయనున్నారని సమాచారం. దీనికోసం వారణాసిలో భారీ సెట్ వర్క్ జరుగుతోందట.
ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా, యూరప్ దేశాల్లోనూ ఈ మూవీ షూటింగ్కు ప్లాన్ చేశారట రాజమౌళి. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా సినిమా విడుదలయ్యేలా సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.