రాజశేఖర్ రెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డిలానే ఉంటారు: రేవంత్ రెడ్డి

రాజశేఖర్ రెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డిలానే ఉంటారు: రేవంత్ రెడ్డి

రాజశేఖర్ రెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డిలానే ఉంటారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ .. రాయలసీమకు ఖచ్చితంగా నీరు తీసుకుపోతారన్నారు. ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. అయితే మనం ఏం చేస్తున్నాం?  ధనాశకు అలవాటు పడ్డ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు. రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా తప్పులను ఒప్పుకున్నారని చెప్పారు రేవంత్. కాళేశ్వరం రెండు టీఎంసీ ల కోసం లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. జగన్ రోజుకు కృష్ణా నది నుంచి తీసుకెళ్లే 12 టీఎంసీల  కోసం 25 వేల కోట్ల ఖర్చు మాత్రమే చేస్తున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి.