ఉత్తరాది ఫలితాలు రిపీట్​ అవుతయ్ : భజన్ లాల్ శర్మ

ఉత్తరాది ఫలితాలు రిపీట్​ అవుతయ్ : భజన్ లాల్ శర్మ

శంషాబాద్, వెలుగు: తెలంగాణతోపాటు, దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది ఫలితాలే రిపీట్​అవుతాయని, బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందని రాజస్థాన్ సీఎం భజనలాల్ శర్మ చెప్పారు. బుధవారం శంషాబాద్​లో నిర్వహించిన ‘ప్రవాసి సమ్మేళన్’లో పాల్గొన్నారు. శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలో నివసిస్తున్న ఉత్తరాది ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులతో మాట్లాడారు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డబుల్​ఇంజిన్​సర్కార్​రావడంతో రాజస్థాన్​అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.

తెలంగాణలోనూ అలాంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నాయన్నారు. మోదీ నిర్ణయాలు, చర్యలతో దేశం సుభిక్షంగా ఉందన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తన గెలుపు కోసం తరలివచ్చిన రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాజస్థాన్ చీఫ్ విప్ నారాయణ్ లాల్ పంచారియా, అహోర్ ఎమ్మెల్యే ఛగన్ సింగ్ రాజ్పుతోహి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.