13వ తేదీ నుంచి పెట్రోల్ బంకులు బంద్ : రాజస్థాన్ లో డీలర్స్ వార్నింగ్

13వ తేదీ నుంచి పెట్రోల్ బంకులు బంద్ : రాజస్థాన్ లో డీలర్స్ వార్నింగ్

పన్నులు తగ్గించాలనే డిమాండ్‌తో రాజస్థాన్ పెట్రోలియం డీలర్లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను ప్రకటించారు. నిరసనలో భాగంగా సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు బంద్ చేయనున్నారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే,, సెప్టెంబర్ 15 నుంచి పెట్రోల్ పంప్ ఆపరేటర్లు నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు పిలుపునిచ్చారు.

భారతదేశంలో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం, రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో ఇంధనం ధర అత్యంత ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.112.74కి చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.97.57గా ఉంది. ఇదిలావుండగా, పోర్ట్ బ్లెయిర్ లో మాత్రం ఇవి చాలా చౌకగా లభిస్తున్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.84.10, డీజిల్ లీటరుకు రూ.79.74గా ఉంది.

భారతదేశంలోని 16 రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 1వంద పైనే ఉన్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, సిక్కిం, ఒడిశా, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో పెట్రోల్ లీటరుకు 100 రూపాయలకు పైగా అమ్ముడవుతోంది. అలాగే, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కూడా డీజిల్ ధరలు లీటరుకు రూ. 100 పైనే ఉన్నాయి.