భక్తులతో కిక్కిరిసిన రాజన్న ఆలయం

 భక్తులతో కిక్కిరిసిన రాజన్న ఆలయం
  • దర్శనానికి 8 గంటలు 
  • వెహికిల్స్​తో నిండిపోయిన గుడి చెరువు గ్రౌండ్​

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహా శివరాత్రి జాతరను తలపించేలా భక్తులతో నిండిపోయింది. రాజన్న ఆలయ గుడి చెరువు గ్రౌండ్​లో వెహికిల్స్​ ఫుల్​అయిపోయాయి. మేడారం సమ్మక్క జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం అనవాయితీ కావడంతో  సోమవారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూ లైన్​లో వేచి ఉన్నప్పటికీ  దర్శనానికి 8 గంటల టైం పట్టింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రాజన్నను ఆత్మానంద ఆశ్రమ పీఠాధిపతి (నర్సాపూర్) పూజ్యపాద రాజయోగి వెంకటస్వామి దర్శించుకున్నారు. వెంట వీహెచ్‌‌‌‌పీ లీడర్లు ఉన్నారు .