
- దర్శనానికి 8 గంటలు
- వెహికిల్స్తో నిండిపోయిన గుడి చెరువు గ్రౌండ్
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహా శివరాత్రి జాతరను తలపించేలా భక్తులతో నిండిపోయింది. రాజన్న ఆలయ గుడి చెరువు గ్రౌండ్లో వెహికిల్స్ ఫుల్అయిపోయాయి. మేడారం సమ్మక్క జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం అనవాయితీ కావడంతో సోమవారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికీ దర్శనానికి 8 గంటల టైం పట్టింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈఓ రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రాజన్నను ఆత్మానంద ఆశ్రమ పీఠాధిపతి (నర్సాపూర్) పూజ్యపాద రాజయోగి వెంకటస్వామి దర్శించుకున్నారు. వెంట వీహెచ్పీ లీడర్లు ఉన్నారు .