జేమ్స్ బాండ్కు రామ్ చరణ్ బెస్ట్ చాయిస్..

జేమ్స్ బాండ్కు రామ్ చరణ్ బెస్ట్ చాయిస్..

RRRతో రామ్ చరణ్  రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇన్నాళ్లు చేసిన సినిమాలతో రాని పేరు RRRతో సంపాదించాడు.  దేశ వ్యాప్తంగా రామ్ చరణ్ తేజ్ పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో అల్లూరి సితారామరాజుగా చెర్రీ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా విడుదల కావడంతో హాలీవుడ్లోనూ రామ్ చరణ్ యాక్టింగ్కు ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ జేమ్స్ బాండ్ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

గత కొద్ది కాలంగా జేమ్స్ బాండ్ అంటే మనకు గుర్తుకు వచ్చేది డానియల్ క్రేగ్. మొత్తం ఆరు జేమ్స్ బాండ్ సిరీస్లలో క్రేగ్ నటించాడు. అయితే 2021లో  టైమ్ టూ డై లో మూవీలో నటించిన తర్వాత..జేమ్స్ బాండ్ సిరీస్ నుంచి డానియల్ తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ సిరీస్లో మరో జేమ్స్ బాండ్ సినిమా రాలేదు. అయితే తాజాగాRRRలో  తన నటనతో మెప్పించడంతో..జేమ్స్ బాండ్ చిత్రానికి రామ్ చరణ్ బెస్ట్ చాయిస్ అని హాలీవుడ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

  


రామ్ చరణ్కే ఎక్కువ ఓట్లు..
జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ బెస్ట్ చాయిస్ అని మార్వెల్ లూక్ కేజ్ సృష్టికర్త చియో హోదారి కోకర్ చెబుతున్నారు.  జేమ్స్ బాండ్ పాత్రలో ఏ హీరో అయితే బాగుంటుంది  అని తెలుసుకోవడం ట్విట్టర్ వేదికగా చియో హోదారి కోకర్ ఓ పోస్టు పెట్టాడు. ఇందులో  మాథ్యూ గూడె, డామ్సన్ ఇద్రిస్, ఇద్రిస్ ఎల్బా, సోప్ దిరిసు, రామ్ చరణ్ తేజ్ లాంటి వారిని నటుల్ని కొంతమంది సజెస్ట్ చేశాడు. అయితే చాలా మంది  రామ్ చరణ్ పేరును ప్రస్తావిస్తూ రీట్వీట్ చేశారు. జేమ్స్ బాండ్కు రామ్ చరణ్ కరెక్ట్ చాయిస్ అని కామెంట్స్ చేశారు.  ట్విట్టర్ కామెంట్స్తో చియో హోదారి కోకర్ కూడా జేమ్స్ బాండ్కు రామ్ చరణ్ కరెక్ట్ చాయిస్ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. జేమ్స్ బాండ్గా రామ్ చరణ్ త్వరలో కనిపిస్తారని ఆశలు పెట్టుకుంటున్నారు. 

శంకర్ సినిమాతో బిజీ..


RRR తర్వాత రామ్ చరణ్..ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర కనిపించబోతునున్నారు. 2023 సంక్రాంతి కి సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘విశ్వంభర’, అధికారి అనే టైటిల్స్ వినిపించాయి.  ఇందులో  రామ్ చరణ్ ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీఎం పాత్రలో ఎస్.జే.సూర్య నటిస్తున్నట్టు తెలుస్తోంది.  దిల్ రాజు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తుండగా..థమన్ సంగీతం అందిస్తున్నారు.