
యంగ్ హీరో రామ్ ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో రామ్ మాస్ లుక్లో కనిపించనున్నాడు. రీసెంట్గా విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇదిలా ఉంటే రామ్ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. రామ్ హీరోగా త్రివిక్రమ్ ఓ మూవీ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కథ సిద్ధం చేశారని, రామ్..
‘డబుల్ ఇస్మార్ట్’ పూర్తి చేయగానే దీన్ని మొదలుపెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రామ్ పెదనాన్న స్రవంతి రవి కిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్రివిక్రమ్, స్రవంతి రవి కిశోర్కు మంచి అనుబంధం ఉంది. మొదటి సినిమా ‘నువ్వే నువ్వే’కు డైరెక్షన్ చాన్స్ ఇచ్చింది రవి కిశోర్ కావడంతో ఆయనపై ప్రత్యేక అభిమానం ఉంది త్రివిక్రమ్కు. చాలా రోజులుగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు రవి కిశోర్. ఎట్టకేలకు అది ఇప్పుడు పట్టాలెక్కే టైమ్ వచ్చినట్టు తెలుస్తోంది.
త్వరలోనే ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసేలా వీరు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమాకు కమిట్ అయ్యారు. అయితే బన్నీ ‘పుష్ప2’తో బిజీగా ఉండటం, తర్వాత అట్లీతో ఓ సినిమాకు కమిట్ అవడంతో త్రివిక్రమ్ మూవీకి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈలోపు రామ్తో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.