సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌గా రామ్మోహన్‌‌రావు

సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌గా రామ్మోహన్‌‌రావు

న్యూఢిల్లీ :  సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌గా గోవిందయపల్లి రామ్మోహనరావు బాధ్యతలు స్వీకరించారని సంస్థ ప్రకటించింది. దర్యాప్తు,  అంతర్గత తనిఖీ విభాగాలకు ఆయన నాయకత్వం వహిస్తారని తెలిపింది.  

ఇంతకుముందు, రావు సెబీ రీజనల్​ ఆఫీసుకు ప్రాంతీయ డైరెక్టర్‌‌గా పనిచేశారు.  తనిఖీలు, పెట్టుబడిదారుల సేవా కేంద్రాల ఏర్పాటు, పెట్టుబడిదారుల అవగాహన,  ఫిర్యాదుల పరిష్కారాలతో సహా పలు పోర్ట్​ఫోలియోలను పర్యవేక్షించారు. రావు మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు. ఆయన అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్ నుంచి సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్ కూడా.