సంక్రాంతి పండుగ పూట.. మందు తాగొచ్చి దారుణ హత్య

సంక్రాంతి పండుగ పూట.. మందు తాగొచ్చి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి పండుగ పూట దారుణం జరిగింది. మంచిరేవులలో జంగయ్య అనే వాచ్ మెన్ దారుణ హత్య గురయ్యాడు. వాచ్ మెన్, తాపీ మేస్త్రీ మధ్య గొడవే జంగయ్య హత్యకు దారితీసిందని తెలుస్తోంది.  

కన్ స్ట్రక్షన్ కు సంబంధించిన స్ర్కాప్ స్టీల్ మెటీరియల్ అమ్ముతున్నానని.. జంగయ్య తనపై మేనేజ్మెంట్ కు చెప్పాడని కోపం పెంచుకున్నాడు తాపీ మేస్త్రే అర్జున్. 

సంక్రాంతి పండుగ రోజు రాత్రి(జనవరి 15) మద్యం తాగివచ్చిన అర్జున్... జంగయ్య తలపై బండరాయితో కొట్టాడు. దీంతో జంగయ్య అక్కడిక్కడే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. జంగయ్య నల్లొండ జిల్లా కందుకూరు డిండికి చెందిని వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు అర్జున్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.