తాగిన మత్తులో  వివాహితపై అత్యాచారం

తాగిన మత్తులో  వివాహితపై అత్యాచారం

అమ్రాబాద్, వెలుగు:  నిద్రిస్తున్న ఓ వివాహిత (43) పై తాగిన మైకంలో ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన సార్లపల్లిలో ఓ వివాహిత బుధవారం మధ్యాహ్నం తన ఇంట్లో నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన చిగుర్ల  లింగయ్య (27) మద్యం మత్తులో ఇంట్లోకి వెళ్లి రేప్​ చేశాడు. మహిళ అరుపులు విన్న చుట్టుపక్కలవాళ్లు అతడిని పట్టుకొని కొట్టారు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ బీసన్న గ్రామానికి చేరుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించారు. పల్లెల్లో నాటుసారా అమ్మకాల వల్లే  యువత బాగా తాగి,  ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. నాటుసారా అమ్మకాలను నియంత్రించాలని ఎక్సైజ్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.