కశ్మీర్ మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

కశ్మీర్ మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

ఉగ్రవాదులకు ఆర్ధిక సాయం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న  మాజీ ఎమ్మెల్యే రషీద్ ఇంజినీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్ము కశ్మీర్ కు చెందిన రషీద్ ఇంజినీర్..  ఉగ్రవాదులకు ఆర్థికంగా సాయపడుతున్నట్టు ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ శుక్రవారం అరెస్ట్ చేసింది. ఈ రోజు ఆయన్ను ఢిల్లీ పటియాలా కోర్టు లో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం ఈ నెల 14 వరకు కస్టడీలోకి తీసుకొమ్మని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఉగ్రవాదులతో సంబంధాలున్న మాజీ ఎమ్మెల్యే రషీద్ ను అరెస్టు చేసి రిమాండుకు పంపించింది.