రెండు లక్షల రూపాయలను కొరికేసిన ఎలుకలు

రెండు లక్షల రూపాయలను కొరికేసిన ఎలుకలు

మహబూబాబాద్ జిల్లాలో కన్నీళ్లు తెప్పించే ఘటన జరిగింది. మహబూబాబాద్ మండలం ఇంద్రానగర్ తండాలో రెడ్యా అనే వ్యక్తి కష్టపడి సంపాదించిన రూ. 2 లక్షల రూపాయలను కొన్ని రోజుల క్రితం ఇంట్లో దాచి పెట్టాడు. అయితే తాజాగా ఆయనకు డబ్బులతో అవసరం ఉంచి సంచిలో నుంచి తీసి చూసేసరికి నోట్లన్నీ ముక్కలుముక్కులుగా ఉన్నాయి. డబ్బులు దాచిన సంచిలోకి దూరిన ఎలుకలు.. నోట్ల కట్టలను కొరికి పడేశాయి. దాంతో బాధితుడు.. చిరిగిన నోట్లతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు.