టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ముంబైలో ఒకే ఫ్రేమ్లో కనిపించారు. అజయ్ దేవగన్ కొత్త సినిమా ‘రైడ్2’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా, ముహూర్తపు షాట్కి రవితేజ క్లాప్ కొట్టాడు. దీనికి అజయ్ సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెప్పాడు. రవితేజ రియాక్ట్ అవుతూ ‘‘రైడ్ 2’ లాంచ్ ఈవెంట్కి రావడం గౌరవంగా ఫీల్ అవుతున్నా. అజయ్ కెరీర్లో ఇదొక మెమరబుల్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నా’ అని పోస్ట్ చేశాడు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. అజయ్ ‘రైడ్’ ఫస్ట్ పార్ట్ని రవితేజ, హరీష్ ‘మిస్టర్ బచ్చన్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ‘రైడ్ 2’ విషయానికొస్తే.. ఐటీ రైట్స్ బ్యాక్డ్రాప్లో ఓ కొత్త కేసు నేపథ్యంలో ఉండబోతుంది. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. నవంబర్ 15న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.