గచ్చిబౌలి, వెలుగు : శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి ఎంపిక ఉత్కంఠ వీడింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా మారబోయిన రవికుమార్యాదవ్పేరును పార్టీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో గురువారం కొండాపూర్ మజీద్బండలోని రవికుమార్ యాదవ్ ఆఫీస్ వద్ద ఆయన అనుచరులు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నామినేషన్ వేసేందుకు రవికుమార్ ఏర్పాట్లు చేసుకున్నారు. శేరిలింగంపల్లి బీజేపీ టికెట్ కోసం ఆ పార్టీ నేతలు గజ్జల యోగానంద్, రవికుమార్యాదవ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
శేరిలింగంపల్లి టికెట్ తమకే ఇవ్వాలంటూ పార్టీ ఆఫీసు ముందు ధర్నాలు కూడా చేశారు. మరోవైపు పొత్తులో భాగంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు పట్టుబట్టారు. శేరిలింగంపల్లిలో బీజేపీ పటిష్టంగా ఉండడం, రవికుమార్ యాదవ్ నిత్యం ఓ కార్యక్రమం నిర్వహిస్తూ జనాల సమస్యలు తెలుసుకున్నారు. ‘గడప గడపకు రవన్న’ పేరుతో పాదయాత్ర చేశారు. పార్టీ అధిష్టానం చివరిగా రవికుమార్ యాదవ్ను శేరిలింగంపల్లి నుంచి అభ్యర్థిగా ఎంపిక చేసింది. టికెట్ కోసం పోటీ పడ్డ గజ్జల యోగానంద్కు నిరాశ ఎదురైంది.