మాస్‌ మహారాజా ర‌వితేజ విరాళం

మాస్‌ మహారాజా ర‌వితేజ విరాళం

లాక్ డౌన్‌ వల్ల సినిమా షూటింగ్ లన్నీ నిలిచిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ త‌రుణంలో పేద సినీ కార్మికులను కాపాడ‌టానికి సినీ ప్ర‌ముఖులు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మాస్‌ మహారాజా రవితేజ కూడా సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. తనవంతు సహాయంగా రూ.20 లక్షల విరాళం ప్రకటించాడు. ఈ మొత్తాన్ని కరోనా క్రై సిస్‌ చారిటీస్ కు అందిస్తున్నటు తెలిపాడు.