బ్యాంక్ చీఫ్ లతో RBI గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశం

బ్యాంక్ చీఫ్ లతో RBI గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశం

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇవాళ(శనివారం) బ్యాంక్‌ చీఫ్‌లతో సమావేశం కానున్నారు. భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి.. సంక్షోభం క్రమంలో దేశ ఆర్థిక పరిస్థితి, అలాగే పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. RBI ఇప్పటికే చేపట్టిన పలు చర్యల అమలుపైనా చర్చిస్తారు. వడ్డీ రేట్లు, వాటి బదిలీ, పరిశ్రమకు మద్దతుగా చర్యలు వంటి అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. దీంతో పాటు ఎంఎస్‌ఎంఇ పరిశ్రమ, గ్రామీణ రంగానికి అనుకూలంగా చేపట్టిన విధానాలను కూడా సమీక్షిస్తారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు చేపట్టాల్సిన మరిన్ని చర్యలకు గాను బ్యాంకర్ల నుంచి సలహాలు, సూచనలను కూడా స్వీకరించనున్నారు RBI అధికారులు.