ఇంటి ముందు వ్యర్థాలు వేయవద్దన్న భార్యాభర్తలపై రియల్టర్ దాడి

ఇంటి ముందు వ్యర్థాలు వేయవద్దన్న భార్యాభర్తలపై రియల్టర్ దాడి

రంగారెడ్డి జిల్లా: మణికొండ మున్సిపలిటీ పుప్పాలగూడలో ఓ రియల్టర్ రెచ్చిపోయాడు. చెత్తాచెదారులు ఇంటి ముందు వేయోద్దన్నందుకు అనుచరులతో కలిసి రమేష్ అనే వ్యక్తిపై దాడి చేశాడు. వినాయక్ నగర్ ఫేస్ 2లో నివాసముండే రమేష్ ఇంటి దగ్గర.. ఉపేందర్ రెడ్డి కొంతకాలంగా వ్యర్థాలు వేస్తున్నాడు. దీంతో మట్టి వ్యర్థాలను వేయోద్దన్నందుకు ఉపేందర్ రెడ్డి కొందరు వ్యక్తులతో కలిసి దాడి చేశారని బాధితులు చెప్పారు. అడ్డొచ్చిన తన భార్యను బూతులు తిడుతూ దాడి చేశారు. ఆ వీడియో సిసి కెమెరాలో రికార్డు అయ్యింది. కాలనీలలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు ఇలా ఉంటాయని బెదిరిస్తుంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. వీరి వల్ల కాలనీ వాసులందరికి ప్రాణ హానీ ఉందని వెల్లడిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులకు  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

గత కొంత కాలంగా వీరి ఇంటి ముందు  ఖాళీ స్థలంలో  రియాల్టర్‌ బిల్డర్‌ ఉపేందర్‌రెడ్డి, రాహుల్‌లు స్థానికంగా మట్టి వ్యర్థాలను తీసుకువచ్చి వీరి ఇంటి పక్కన డంప్‌ చేస్తున్నాడు. ఇదేమని పలుమార్లు ప్రశ్నిస్తే తన అనుచరులు, రౌడీలతో కలిసి వచ్చి రమేష్‌ ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. రోజు రోజుకు ఉపేందర్‌రెడ్డి, రాహుల్‌ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. రోడ్లపైనే మద్యం సేవించడం, నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లను మైనర్ డ్రైవర్లతో నడిపించడం వంటి అక్రమాలకు పాల్పడతాడని బాధితులు ఆరోపించారు.