ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
జీడిమెట్ల, వెలుగు: మైనర్పై పెదనాన్న అత్యాచారానికి పాల్పడిన ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిటీలో ఉండే ఓ మహిళ ఇండ్లల్లో పనిచేస్తోంది. ఆమె భర్త లేబర్. ఆరో తరగతి చదువుతున్న వారి కూతురు(13) అప్పుడప్పుడు పెదనాన్న రాములు(50) ఇంటికి టీవీ చూసేందుకు వెళ్లేది. ఈ క్రమంలో రాములు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నెల 24న బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆమె తల్లి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. బాలిక గర్భవతి అని డాక్టర్ చెప్పాడు. పెద్దనాన్న రాములు తనను అత్యాచారం చేశాడని బాలిక తల్లితో చెప్పడంతో ఆమె జగద్గిరిగుట్ట పీఎస్లో కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ కేసు విషయంలో ఎస్ఐ సెటిల్ మెంట్కు ప్రయత్నించడం వల్లే ఘటన ఆలస్యంగా బయటకు వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.