పదో తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల

పదో తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల

హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. పరీక్షల షెడ్యూల్ ను మంగళవారం పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసింది. మే 17 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనుండగా..ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. మే 17న ఫస్ట్ ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 19న ఇంగ్లీష్, 20న మ్యాథ్స్, 21న సైన్స్, 22న సోషల్, 24న ఒకేషనల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, 25న ఒకేషనల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 26న ఎస్ఎస్ సీ ఒకేషనల్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది పాఠశాల విద్యాశాఖ.