గ్రూప్ 2 అభ్యర్థులను రెచ్చగొట్టిన కేసులో.. ఒకరికి రిమాండ్​

గ్రూప్ 2 అభ్యర్థులను రెచ్చగొట్టిన కేసులో..  ఒకరికి  రిమాండ్​

గ్రూప్ 2 అభ్యర్థుల TSPSC ముట్టడి కేస్ లో కీలకంగా వ్యవహరించారని భావిస్తూ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్​ ఆన్ లైన్ ఇనిస్టిట్యూట్ పేరుతో అశోక్  గ్రూప్స్ కోచింగ్ సెంటర్​ నిర్వహిస్తున్నాడు.

ఆగస్టు 10న గ్రూప్​2 అభ్యర్థులను రెచ్చగొట్టి నిరసన తెలిపేలా చేసిన కేసులో బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో అశోక్ పై కేసు నమోదు అయింది. దీంతో అతన్ని విచారణ కోసం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. విచారించిన కోర్టు నిందితుడికి 14 రోజుల పాటు జుడిషయల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అశోక్ ను చంచల్ గూడ జైల్ కు తరలించారు.